రైతులకు గుడ్‌న్యూస్.. నేడు అకౌంట్లలోకి డబ్బులు, రూ.2 లక్షల వరకు లబ్ధి

తెలంగాణలోని రైతులకు తీపి కబురు. నేడు మూడో విడత రైతు రుణమాఫీ జరగనుంది. ఇప్పటికే రెండు విడతల్లో రూ. లక్షన్నర వరకు రుణాలు మాఫీ కాగా.. నేడు మూడో విడతలో రూ. లక్షన్నర నుంచి రూ. 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేయనున్నారు. ఖమ్మం జిల్లా వైరాలో సీఎం రేవంత్ ఈ మేరకు రైతులకు చెక్కులను అందజేయనున్నారు.

కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీ రూ.2 లక్షల రైతు రుణమాఫీ. తాము అధికారంలోకి వస్తే రూ. 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. ఇచ్చిన మాట ప్రకారం… ప్రభుత్వం రూ.2 లక్షల రైతు రుణమాఫీకి కట్టుబడి ఉంది. ఇప్పటికే రెండు విడతల్లో రూ. లక్షన్నర వరకు రైతు రుణమాఫీ చేసింది. తొలి విడతలో రూ. లక్ష వరకు ఆ తర్వాత రెండో విడతలో రూ. లక్షన్నర వరకు రైతుల రుణాలు మాఫీ చేసింది. ఇక మూడో విడత రైతు రుణమాఫీకి ప్రభుత్వం సిద్ధమైంది.

రాష్ట్రంలోని రైతులకు నేడు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ కానుంది. ఖమ్మం జిల్లా వైరా బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రైతులకు రూ. లక్షల వరకు రుణమాఫీ చెక్కులను అందజేయనున్నారు. అనంతరం అన్నదాతల అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయి. మూడో విడత మాఫీతో 42 లక్షల మంది రైతులు రుణ విముక్తులు అవుతారని మంత్రి తుమ్మల వెల్లడించారు. మొత్తం రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. ప్రభుత్వానికి భారమైనా.. సీఎం రేవంత్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నారు. రైతు రుణమాఫీపై ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు.

కాగా, జులై 18న తొలి విడత రుణమాఫీ చేశారు. రూ. లక్షలోపు రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. మెుత్తం 11.34 మంది అన్నదాతల ఖాతాల్లో రూ.6 వేల కోట్లకు పైగా సొమ్ము జమ చేసింది. జులై 30 రెండో విడత రుణమాపీ చేశారు. రూ.లక్షన్నర లోపు రుణాలను మాఫీ చేశారు. మెుత్తం 6.40 లక్షల మంది రైతుల బ్యాంకు అకౌంట్లలో రూ.6.190 కోట్లు జమ చేశారు. రెండు విడతల్లో కలిపి మెుత్తం 17.75 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.12,224 కోట్లు జమ చేసినట్లు ప్రభుత్వం చెప్పింది. నేడు మిగిలిన రైతులకు కూడా రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

Related Articles

Back to top button