Trending
అన్న క్యాంటీన్ ప్రారంభం.. పేదలతో కలిసి భోజనం చేసిన సీఎం చంద్రబాబు దంపతులు
ఏపీలో ‘అన్న క్యాంటీన్’ (Anna Canteen) మళ్లీ ప్రారంభమైంది. రాష్ట్రంలో మొదటిగా కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు దీన్ని ప్రారంభించారు. అనంతరం సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరితో కలిసి పలువురికి స్వయంగా భోజనం వడ్డించారు. పేదలతో కలిసి భోజనం చేస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.



